రాహుల్, త్రిష్ణా ముఖర్జీ జంటగా నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ `మధ`. ఈ చిత్రం ద్వారా శ్రీవిద్య దర్శకురాలిగా పరిచయం అవుతోంది. ఇందిర బసవ నిర్మించారు. ఈ నెల 13న విడువదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్ని గురువారం దర్శకుడు హరీష్శంకర్, హీరో నవదీప్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేష్ కోనేరు రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్కు ముందే వివిధ ఫిల్మ్ ఫెస్టివెల్స్లో పాల్గొన్న ఈ చిత్రానికి దాదాపు 26 పురస్కారాలు దక్కడం విశేషం.
ఈ సందర్భంగా దర్శకుడు హరీష్శంకర్ మాట్లాడుతూ `సాధారణంగా యంగ్ ఏజ్లో అందరూ డబ్బులు పెట్టి సినిమాలు చూస్తారు. కానీ శ్రీవిద్య మాత్రం డబ్బులు పెట్టి సినిమా తీసింది. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు చాలా ప్యాషన్తో సినిమా చేసిందనిపించింది. తనకు మంచి గుర్తింపు రావాలి. మన తెలుగమ్మాయి చేసిన ఈ సినిమా మన తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని నేను, మహేష్, నవదీప్ ముందుకు వచ్చాం` అని తెలిపారు.
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరు ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్రధాన కారణం హరీష్శంకర్, నవదీప్. ఈ నెల 13న సినిమాని విడుదల చేస్తున్నాం` అని మహేష్ కోనేరు చెప్పారు. మూడేళ్ల నా కల నెరవేరిన రోజిదని, ఇది రెగ్యులర్ సినిమా కాదు. ప్యారలల్ సినిమా. నిత్యం స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. 26 ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శిస్తే అవార్డులు దక్కాయి` అని దర్శకురాలు తెలిపింది.