యంగ్ హీరో నితిన్ స్పీడుమీదున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలను విడుదల చేసాడు. మరో చిత్రం మేస్ట్రో మరికొన్ని రోజుల్లో హాట్ స్టార్ లో విడుదలవుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాన్ని ప్రకటించాడు. నితిన్ 31వ చిత్రాన్ని ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేయనున్నాడు.
ఎస్ఆర్ శేఖర్ గా ఈ ఎడిటర్ ఫేమస్. పూరి జగన్నాథ్ క్యాంపు నుండి వచ్చాడు ఈ ఎడిటర్ కమ్ డైరెక్టర్. ఈ చిత్రం మాస్ జోనర్లో రూపొందించనున్నట్లు మోషన్ పోస్టర్ చూస్తే అర్ధమవుతోంది. అలాగే మాచర్ల నియోజకవర్గం అనే మాస్ అండ్ క్యాచీ టైటిల్ ను కూడా కన్ఫర్మ్ చేసారు. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది.
త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. భీష్మ, మేస్ట్రో తర్వాత మరోసారి నితిన్ సినిమాకు పనిచేస్తున్నాడు మణిశర్మ తనయుడు. ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫీ అందిస్తాడు.