మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఈరోజు ఉద్రిక్తల మధ్య మొదలైంది. ఉదయం 8 గంటలకు ఎన్నికలు మొదలవ్వగా మంచు విష్ణు. ప్రకాష్ రాజ్ లు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. మోహన్ బాబు కాళ్ళను ప్రకాష్ రాజ్ తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో అంతా సమసిపోయిందనుకున్నారు.
అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులపై మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలింగ్ లోపలికి వచ్చి ప్రచారం చేస్తున్నారని కన్నెర్రచేసారు. ఈ నేపథ్యంలో శివా రెడ్డి వద్ద ఉన్న బ్యాలెట్ నమూనా పత్రాన్ని శివ బాలాజీ లాక్కున్నారు. ఇద్దరి మధ్యా తోపులాట జరిగింది. ఎన్నికల అధికారులు వచ్చి ఇద్దరినీ బయటకు పంపేశారు.
మరి కాసేపటికి నటుడు బనెర్జీ, మోహన్ బాబుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. అన్నిటికన్నా చిల్లర గొడవగా అనిపించిన విషయం నటి హేమ శివ బాలాజీను కొరికిందిట. నరేష్ మీడియా ముందుకొచ్చి శివ బాలాజీ గాయాన్ని చూపించారు. మధ్యలో రిగ్గింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో ఎన్నికల అధికారి సీసీటీవీ ఫుటేజ్ ను చెక్ చేశారట.
ప్రముఖ నటులు చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, జెనీలియా, రోజా, నాగబాబు, బ్రహ్మానందం తదితరులు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.