`భారతీయుడు 2` సెట్ లో షూటింగ్ జరుగుతుండగా ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు సిడ్డంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ విషాదకర ఘటన తమిళ సినీ పరిశ్రమలో ప్రకంపణలు సృష్టిస్తోంది. ఈ సంఘటన జరిగన వెంటనే కమల్ కోటి రూపాయలు బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నానని, కోట్లు పెట్టి సినిమాలు నిర్మిస్తున్నా కార్మికుల కోసం కనీస రక్షణ లేదని, ఈ విషయంలో తాను వ్యక్తిగతంగా సిగ్గుపడుతున్నానని కమల్ వెల్లడించారు.
ఆ తరువాత బాధిత కుటుంబాలని ఆదుకోవాలని, సెట్లో భద్రతకు సంబంధించిన కొన్ని షరతులు అంగీకరిస్తేనే తాను షూటింగ్లో పాల్గొంటానని కమల్ లైకాకు ఓ లేఖ రాశారు. దీనిపై లైకా వర్గాలు, నిర్మాత సుభాస్కరన్ సీరియస్గా స్పందించారు. `షూటింగ్ సమయంలో జరిగిన క్రేన్ ప్రమాదం దురదృష్టకరం. బాధిత కుటుంబాలకు సంస్థ తరుపున అనునిత్యం అందుబటులోనే వుంటున్నాం. బాధిత కుటుంమాలకు 2 కోట్లు ఆర్థిక సహాయాన్ని ప్రకటించాం. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నాం. మీరు అడిగిన సదుపాయాలన్నింటినీ ఈ నెల 22నే సమకూర్చాం అని బదులిచ్చారు.
షూటింగ్ సమయంలో వున్న మీరు ఇవన్నీ గమనించలేదనుకుంటాను. అవి మీదృష్టికి రాకపోవడం వల్లే మీరు మాకు లేఖ రాసారని భావిస్తున్నాం. అయితే ప్రమాద సమయంలో మీరు కూడా అక్కడే వున్నారన్న విషయం ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ప్రొడక్షన్ భీమాతో పాటు వ్యక్తిగత భీమా కాలంలో బాధిత కుటుంబాలకు అందే విధంగా చర్యలు తీసుకుంటాం. బాధితులకు ఆ దేవుడు అండగా వుండాలని ప్రార్థిద్దాం. సినిమా షూటింగ్ పునః ప్రారంభిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం` అని ముగించారు. ఇది కమల్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.