మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రాన్ని దాదాపు పూర్తి చేసేసాడు. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ నడుస్తోంది. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇదిలా ఉంటే ఆచార్య తర్వాత చిరంజీవి తన నెక్స్ట్ సినిమాను కూడా లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. మలయాళ సూపర్ హిట్ డ్రామా లూసిఫెర్ చిత్రాన్ని రీమేక్ చేయనున్నాడు.
మోహన్ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. హైదరాబాద్ లో ఒక భారీ సెట్ ను వేస్తున్నారు. అందులోనే ఒక భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసాడు దర్శకుడు. తాజా సమాచారం ప్రకారం ఆగస్ట్ 12 నుండి లూసిఫెర్ రీమేక్ షూట్ మొదలవుతుంది.
ఎన్వీ ప్రసాద్, రామ్ చరణ్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు కాగా అతని ఇప్పటికే ట్యూన్స్ ను ఫైనలైజ్ చేసేసాడట. త్వరలోనే పాటల రికార్డింగ్ మొదలుపెడతాడు అని తెలుస్తోంది.