భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ (91) అస్వస్థతకు గురయ్యారు దాంతో ఈరోజు జరగాల్సిన జెండావందనం రద్దు అయ్యింది ఆయన ఇంట.
ప్రతీ ఏడాది ఎల్ కే అద్వానీ ఇంట ఘనంగా జాతీయ జెండా ని ఆవిష్కరించి పెద్ద పండగలా చేయడం ఆనవాయితీ.
ఈ ఏడాది కూడా చేయాలనీ అనుకున్నారట ! కానీ గత అయిదు రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాడు అద్వానీ దాంతో జెండా వందన కార్యక్రమం చేయడం లేదని అద్వానీ కార్యాలయ సిబ్బంది తెలిపారు.
భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ దశలో ఉందంటే లాల్ కృష్ణ అద్వానీ , వాజ్ పేయి లు మాత్రమే కారణం.
ఇక అద్వానీ రథయాత్ర దేశ రాజకీయాలను మలుపుతిప్పింది.
కాషాయ రెపరెపల కోసం అహర్నిశలు శ్రమించాడు అద్వానీ.
ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ అద్వానీ శిష్యుడు అన్న విషయం తెలిసిందే.
అద్వానీ , లాల్ కృష్ణ అద్వానీ , ఎల్ కే అద్వానీ , రాజకీయ వార్తలు