తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించిన చిత్రం `కాంచన`. రాఘవ లారెన్స్ నటించి తెరకెక్కించిన ఈ చిత్రం రెండు భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇదే చిత్రాన్ని హిందీలో `లక్ష్మీబాంబ్` పేరుతో రీమేక్ చేస్తున్నారు. కిలాడీ అక్షర్ కుమార్ ఇందులో హీరోగా నటించారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ద్వారా రాఘవ లారెన్స్ బాలీవుడ్కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే వీలు లేకపోవడంతో ఈ చిత్రాన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్ డిస్నీ హాట్ స్టార్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించిన చిత్ర బృందం తాజాగా రిలీజ్ డేట్ని ప్రకటించారు. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని నవంబర్ 9న రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ చిత్రానికి ఓ భయం వెంటాడుతోందట.
ఇటీవల సుశాంత్ సింగ్ మరణంతో బాలీవుడ్పై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బాలీవుడ్ స్టార్స్ని అన్ ఫాలో చేస్తూ బైకాట్ బాలీవుడ్ అంటూ కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో విడుదలైన మహేష్భట్, అలియాభట్ల `సడక్ 2 ` అత్యంత దారుణమైన ఫలితాన్ని అందించింది. నెపోటిజమ్ కారణంగానే సుశాంత్ మతి చెందాడంటూ ఈ సినిమాపై నెటిజన్స్ దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. అదే దాడి `అక్ష్మీ బాంబ్`పై చేస్తే బాలీవుడ్లో లారెన్స్ భవితవ్యం ఏంటనే వాదనలు వినిపిస్తున్నాయి.