కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మనల్ని మనం రక్షించుకోవడానికి ఇంట్లో తయారు చేసిన మాస్కులు ధరించడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. అలా తయారు చేసిన మాస్కుల్ని అందరికి అందిస్తోంది అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. హైదరాబాద్కు చెందిన డిజైనర్ అనితారెడ్డి సహకారంతో ఈ ఏడాది మార్చి నుంచి హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాస్కులు తయారు చేయిస్తోంది. `రెడ్ ట్రీ` బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి మాస్కులని తీసుకొస్తున్నారు.
దీన్ని ఓ వ్యాపారంలా కాకుండా అత్యధిక మందికి మాస్కులు అందజేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎవ్వరూ కరోనా బారిన పడకూడదనే జాగ్రత్తల్లో భాగంగా మాస్కుల్ని అందిస్తూ తమ వంతు సాయం చేస్తోంది. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ `లాక్ డౌన్లో వెసులుబాటు దొరికిందని, నిబంధనలు సడలించారని మాస్కులు ధరించడం మానవద్దని, కరోనాతో చేస్తున్న ఈ పోరాటంలో మీకు బోర్ కొట్టి వుండవచ్చు, మీరు విసుగు చెంది వుండవచ్చు కానీ కరోనా ఉదృతి మాత్రం ఆగలేదని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.
`గో లోకల్ గో వోకల్` అని ప్రజలంతా నినదిస్తున్న ప్రస్తుత తరుణంలో లోకల్ టాలెంట్కి అవకాశం ఇస్తూ లావణ్య త్రిపాఠి తయారు చేయిస్తున్న ఈ మాస్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. టాలీవుడ్ సెలబ్రిటీలలో చాలా మంది ఈ `రెడ్ ట్రీ` మాస్కుల్ని ధరిస్తున్నారట. టైలర్స్, మాస్టర్స్లకు సహాయపడాలనే మాస్కుల తయారీని ప్రారంభించారట. భవిష్యత్తులో ఈ బ్రాండ్ పేరు మీద మరిన్ని ఉత్పత్తులు తీసుకురావాలనే ప్రణాళికలో లావణ్య త్రిపాఠి, అనితారెడ్డి ఉన్నట్టు తెలిసింది.