Homeటాప్ స్టోరీస్`అందాల రాక్ష‌సి` రెడ్ ట్రీ బ్రాండ్‌..!

`అందాల రాక్ష‌సి` రెడ్ ట్రీ బ్రాండ్‌..!

`అందాల రాక్ష‌సి` రెడ్ ట్రీ బ్రాండ్‌..!
`అందాల రాక్ష‌సి` రెడ్ ట్రీ బ్రాండ్‌..!

క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో  మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవ‌డానికి  ఇంట్లో త‌యారు చేసిన మాస్కులు ధ‌రించ‌డం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. అలా త‌యారు చేసిన మాస్కుల్ని అంద‌రికి అందిస్తోంది అందాల రాక్ష‌సి లావ‌ణ్య త్రిపాఠి. హైద‌రాబాద్‌కు చెందిన డిజైన‌ర్ అనితారెడ్డి స‌హ‌కారంతో ఈ ఏడాది మార్చి నుంచి హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి మాస్కులు త‌యారు చేయిస్తోంది. `రెడ్ ట్రీ` బ్రాండ్ పేరుతో మార్కెట్‌లోకి మాస్కుల‌ని తీసుకొస్తున్నారు.

దీన్ని ఓ వ్యాపారంలా కాకుండా అత్య‌ధిక మందికి మాస్కులు అంద‌జేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నారు. ఎవ్వ‌రూ క‌రోనా బారిన ప‌డ‌కూడ‌ద‌నే జాగ్ర‌త్త‌ల్లో భాగంగా మాస్కుల్ని అందిస్తూ త‌మ వంతు సాయం చేస్తోంది. ఈ సంద‌ర్భంగా లావ‌ణ్య త్రిపాఠి మాట్లాడుతూ `లాక్ డౌన్‌లో వెసులుబాటు దొరికింద‌ని, నిబంధ‌న‌లు స‌డ‌లించార‌ని మాస్కులు ధ‌రించ‌డం మాన‌వ‌ద్ద‌ని, క‌రోనాతో చేస్తున్న ఈ పోరాటంలో మీకు బోర్ కొట్టి వుండ‌వ‌చ్చు, మీ‌రు విసుగు చెంది వుండ‌వ‌చ్చు కానీ క‌రోనా ఉదృతి మాత్రం ఆగ‌లేద‌ని ఈ సంద‌ర్భంగా ఆమె స్ప‌ష్టం చేశారు.

- Advertisement -

`గో లోక‌ల్ గో వోకల్` అని ప్ర‌జ‌లంతా నిన‌దిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో లోక‌ల్ టాలెంట్‌కి అవ‌కాశం ఇస్తూ లావ‌ణ్య త్రిపాఠి త‌యారు చేయిస్తున్న ఈ మాస్కుల‌కు మంచి డిమాండ్ ఏర్ప‌డింది. టాలీవుడ్ సెల‌బ్రిటీల‌లో చాలా మంది ఈ `రెడ్ ట్రీ` మాస్కుల్ని ధ‌రిస్తున్నార‌ట‌. టైల‌ర్స్‌, మాస్ట‌ర్స్‌ల‌కు స‌హాయ‌ప‌డాల‌నే మాస్కుల త‌యారీని ప్రారంభించార‌ట‌. భ‌విష్య‌త్తులో ఈ బ్రాండ్ పేరు మీద మ‌రిన్ని ఉత్ప‌త్తులు తీసుకురావాల‌నే ప్ర‌ణాళిక‌లో లావ‌ణ్య త్రిపాఠి, అనితారెడ్డి ఉన్న‌ట్టు తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All