సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రతిరోజూ పండగే. ఈ సినిమా ఇటీవలే ఒక్క పాట తప్పితే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న విషయం తెల్సిందే. ఈ పాట చిత్రీకరణ ఇప్పుడు జరుగుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. థమన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పెప్పీ నెంబర్ ను అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన గ్రాండ్ సెట్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది.
చిత్రలహరి సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్న సాయి ధరమ్ తేజ్ కు ప్రతిరోజూ పండగే హిట్ అవ్వడం ఎంతో ముఖ్యం. ఈ సినిమా సక్సెస్ తిరిగి రైట్ ట్రాక్ లో పడాలని చూస్తున్నాడు తేజ్. ప్రతిరోజూ పండగే డిసెంబర్ 20న విడుదల కానున్న విషయం తెల్సిందే. తేజ్ సరసన ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు పాటలను విడుదల చేసారు. ఈ రెండూ కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. సినిమా చాలా ఆహ్లాదంగా సాగిపోతుందని తప్పకుండా అందరికీ నచ్చుతుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రం ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ప్రధానంగా సాగుతుందని తేజ్ కు తాతగా నటించిన సత్యరాజ్ పాత్ర ఈ చిత్రానికి ప్రధాన హైలైట్ అని అంటున్నారు. దీంతో పాటు రావు రమేష్ పాత్ర కూడా ప్రత్యేకంగా ఉండబోతోంది.
గీత ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మరి తేజ్ ఎదురుచూస్తున్న ఆ భారీ హిట్ ఈ చిత్రంతో వస్తుందేమో చూడాలి.