ఎన్టీఆర్ కథానాయకుడు ఈరోజు విడుదలైన విషయం తెలిసిందే . అయితే ఈ సినిమాపై కామెంట్ చేసి సంచలనం సృష్టించింది లక్ష్మీపార్వతి . ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తీశారు బాగుంది కానీ ఆయన పడిన కష్టం , ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ చూపిస్తేనే అది నిజమైన బయోపిక్ అవుతుంది తప్ప సగభాగాన్ని మాత్రమే తీసి బయోపిక్ అంటే ఎలా ? అని ప్రశ్నిస్తోంది లక్ష్మీపార్వతి .
బాలయ్య చాలా మంచి వాడు కానీ చంద్రబాబు కి భయపడి అసలు నిజాలు చెప్పడం లేదని , అసలైన ఘట్టాలు లేకుండా బయోపిక్ ఎలా అవుతుందని ప్రశ్నిస్తోంది . నిజమే ! లక్ష్మీపార్వతి వాదనలో , ప్రశ్నల్లో వాస్తవం ఉంది . ఎన్టీఆర్ బయోపిక్ అంటే ఖచ్చితంగా 1995 వెన్నుపోటు ఉండాల్సిందే, అప్పటి ఆవేదన ఎలా ఉందో చూపించాల్సిందే కానీ అవేవి ఎన్టీఆర్ బయోపిక్ లో ఉండవు అని తెలుస్తోంది .
English Title: Lakshmiparvathi comments on NTR biopic