శర్వానంద్ హీరోగా ఆడవాళ్లు మీకు జోహార్లు అనే చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాను కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో సాగుతోంది. తాజాగా ఈ చిత్రం ముగ్గురు సీనియర్ నాటి తరం హీరోయిన్స్, నేటి తరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు స్వగతం పలికింది.
ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, ఊర్వశి, ఖుష్భూలు కీలక పాత్రలు పోషిస్తున్నారట. ఈ మూడు పాత్రలూ కథ గమనానికి చాలా ముఖ్యమని టీమ్ చెబుతోంది. వీరు కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు.
రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ పనిచేస్తున్నాడు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆడవాళ్లు మీకు జోహార్లు ఒక భిన్నమైన పాయింట్ పై, నేటి సామాజిక అంశాలను స్పృశించేలా ఉంటుందని తెలుస్తోంది.