ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి చేసింది ఒక్క సినిమానే అయినా కానీ బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది. ఉప్పెన తర్వాత వరసగా అవకాశాలను కొట్టేస్తోంది. మూడు సినిమాల్లో నటిస్తోన్న కృతి శెట్టి ఇప్పుడు జీ తెలుగు సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. జీ సంస్థ ఏడాదికి ఒక సెలబ్రిటీని తమ బ్రాండ్స్ కు అంబాసడర్ గా తీసుకుంటుంది.
అలాగే గతంలో రమ్య కృష్ణ, మహేష్ బాబులు జీ ప్రొడక్ట్స్ కు ప్రచారకర్తలుగా వ్యవహరించారు. అలాగే ఇప్పుడు కృతి శెట్టి ప్రచారకర్తగా మారింది. ఇందులో పెద్ద విశేషం లేదు కానీ ఆమె తీసుకునే పారితోషికం విషయంలోనే ఉంది అసలు వార్త. ఆమె ఏకంగా 1 కోటి రూపాయల పారితోషికాన్ని తీసుకుంటోందిట.
కేవలం ఒకే ఒక్క సినిమా చేసిన హీరోయిన్ కు ఈ రేంజ్ అమౌంట్ అంటే మాటలు కాదు. టాలీవుడ్ లో నెక్స్ట్ టాప్ హీరోయిన్ కృతినే అని అంటున్నారు. మరి అదే నిజం అవుతుందా?