Homeటాప్ స్టోరీస్నేను సేఫ్‌గానే వున్నాను: కృతి గార్గ్‌

నేను సేఫ్‌గానే వున్నాను: కృతి గార్గ్‌

నేను సేఫ్‌గానే వున్నాను: కృతి గార్గ్‌
నేను సేఫ్‌గానే వున్నాను: కృతి గార్గ్‌

ఇటీవ‌లే విడుద‌లైన `రాహు` చిత్రం ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది ఉత్త‌రాది భామ కృతి గార్గ్‌. ఈ హీరోయిన్ ఈ రోజు ఉద‌యం నుంచి క‌నిపించ‌డం లేద‌ని, ప్ర‌భాస్ చిత్రంలో న‌టించే అవ‌కాశం మీదేన‌ని, ఇందుకు ఆడిష‌న్స్ కోసం ముంబై రావాల‌ని `అర్జున్‌రెడ్డి` ద‌ర్శ‌కుడు సందీప్ వంగా పేరుతో ఎవ‌రో ఓ వ్య‌క్తి ప్రాంక్ కాల్ చేశార‌ని `రాహు` చిత్ర ద‌ర్శ‌కుడు పంజాగుట్ట పోలీసుల‌ని ఆశ్ర‌యిస్తున్న‌ట్టు వార్త‌లు వినిపించాయి.

దీంతో టాలీవుడ్‌లో క‌ల‌క‌లం మొద‌లైంది. అయితే తాజాగా ఈ వార్త‌లపై  హీరోయిన్ కృతి గార్గ్ స్వ‌యంగా  స్పదించింది. తాజాగా ఓ వీడియో సందేశాన్ని పంపించింది. తాను ప్రస్తుతం ముంబైలో వున్నాన‌ని, త‌న ఇంట్లోనే సేఫ్‌గా వున్నాన‌ని. ఓ బిగ్ డైరెక్ట‌ర్ పేరుతో ఓక‌డు త‌న‌ని ట్రాప్ చేయాల‌ని ప్ర‌య‌త్నించాడ‌ని, అయితే తాను ఆ ట్రాప్‌లో ప‌డ‌లేద‌ని, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్‌లో రావ‌డం వ‌ల్ల టైడ్ అయి నిద్ర‌పోయాన‌ని, ఆ కార‌నంగానే ద‌ర్శ‌కుడు సుబ్బు కాల్స్‌కి స్పందించ‌లేక‌పోయాయ‌న‌ని వెల్ల‌డించింది.

- Advertisement -

త‌న కోసం ఆందోళ‌న చెంది, త‌నకు ఏం జ‌రిగిందో అని భయాన్ని వ్యక్తం చేసిన త‌న శ్రేయాస్సుని కాంక్షించిన తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కి, ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్‌` అని కృతి గార్గ్ పేర్కొంది.  కృతి న‌టించిన `రాహు` ఇటీవ‌లే విడుద‌లై మంచి ఎంగేజింగ్ థ్రిల్ల‌ర్‌గా ఆక‌ట్టుకుంటోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All