Homeన్యూస్బాలయ్యను డైరెక్ట్ చేయనున్న క్రిష్!!

బాలయ్యను డైరెక్ట్ చేయనున్న క్రిష్!!

బాలయ్యను డైరెక్ట్ చేయనున్న క్రిష్!!
బాలయ్యను డైరెక్ట్ చేయనున్న క్రిష్!!

సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న క్రిష్ తెరకెక్కించిన కొండ పొలం ఈ నెల 8న విడుదలవుతోంది. అదే పేరుతో ఉన్న నవల ఆధారంగా ఈ చిత్రాన్ని క్రిష్ డైరెక్ట్ చేసాడు. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ లు హీరో హీరోయిన్లుగా నటించారు. పవన్ కళ్యాణ్ తో హరిహర వీర మల్లు, క్రిష్ రూపొందిస్తోన్న విషయం తెల్సిందే. ఒక భారీ షెడ్యూల్ ను నవంబర్ లో ప్లాన్ చేసారు. దాంతో చిత్ర ఫస్ట్ హాఫ్ పూర్తవుతుందని సమాచారం.

ఇక విశ్వసనీయ వర్గాల ఇన్ఫో ప్రకారం బాలయ్యను కూడా క్రిష్ డైరెక్ట్ చేయనున్నాడు. ఇదివరకు వీరి కాంబినేషన్ లో గౌతమి పుత్ర శాతకర్ణి విడుదలైంది. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో రూపొందేది సినిమా కాదు, టాక్ షో. వినడానికి కొత్తగా ఉన్నా ఆహా కోసం బాలకృష్ణ ఒక టాక్ షో హోస్ట్ గా మారుతున్నాడు అన్నది సమాచారం.

- Advertisement -

ఈ టాక్ షో కు డైరెక్టర్ గా క్రిష్ వ్యవహరిస్తాడు. బాలయ్య స్టైల్ కు తగ్గట్లుగా షో ను డిజైన్ చేయడం, బాలయ్యతో ర్యాపో ఉండే సెలబ్రిటీలను ఎంపిక చేయడం, మొత్తం షో ను తెర వెనుక నుండి నడిపించే బాధ్యతను క్రిష్ తీసుకున్నాడు. త్వరలోనే ఆహా బాలయ్య టాక్ షో కు సంబంధించిన అధికారిక ప్రకటన చేయనుంది. రీసెంట్ గా బాలకృష్ణ అఖండ షూటింగ్ ను పూర్తి చేసిన విషయం తెల్సిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా కోసం సన్నద్ధమవుతున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All