మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కోటి ఆశలతో ఎదురుచూసిన చిత్రం `క్రాక్`. హిట్ కొట్టాలన్న కసితో యదార్ధ సంఘటనల ఆధారంగా కమర్షియల్ మాస్ మసాలా ఎంటర్టైనర్గా ఈ మూవీని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించారు. 15 ఏళ్ల క్రితం ఒంగోలు పరిసరాల్లో జరిగిన యదార్ధ సంఘటనల్ని తీసుకుని ఈ మూవీని రూపొందించారు.
నో డౌట్ షూర్ షాట్ హిట్ అంటూ ఒకటికి పదిసార్లు పక్కా కాన్ఫిడెంట్తో ప్రచారం మొదలుపెట్టిన ఈ టీమ్కి గట్టి షాక్ తగిలింది. 9 శనివారం ఉదయం 8:45కు షో పడాల్సిన ఈ మూవీ అర్థాంతరంగా ఆగిపోయింది. దీనికి కారణంగా మహేష్ నటించిన `స్పైడర్` అని కొంత మంది అంటుంటే తమిళ `టెంపర్` రీమేక్ అని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ రెండు చిత్రాల వల్ల 10 కోట్ల మేర నష్టాలొచ్చాయి. ఆ మొత్తాన్ని ఫైనాన్షియర్లకి తిరిగి నిర్మాత ఠాగూర్ మధు చెల్లించాల్సి వుంది. `క్రాక్` సినిమా రిలీజ్ సమయంలో ఈ మొత్తం చెల్లించాలంటూ ఫైనాన్షియర్స్ పట్టుబట్టారు. ఇండస్ట్రీకి చెందిన వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోయింది. మార్నింగ్ షో పడలేదు. మధ్యాహ్నం షో పరీస్థితీ అంతే.. నైట్ షో పడకపోతే ఈ రోజు `క్రాక్` రిలీజ్ కానట్టే. ఇది నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్కు పెద్ద దెబ్బే అంటున్నారు.