మాస్ మహారాజా రవితేజ నటించిన పక్కా మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ ‘క్రాక్’. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్పై బి. మధు ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. ఈ సంక్రాంతికి .నవరి 9న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సెలెక్టీవ్గా కొంత మంది మీడియా వర్గాలతో మాస్ రాజా రవితేజ ముచ్చటించారు. ` క్రాక్` పండుగకు పక్కా కమర్షియల్.. ఫుల్ మీల్స్ సినిమా`అన్నారు.
ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ `తెలుగు రాష్ట్రాల్లో కేవలం యాభై శాతం సీటింగ్ సామర్థ్యానికి మాత్రమే అనుమతిచ్చారని నాకు తెలుసు. కానీ ‘క్రాక్’ ప్రేక్షకుల నుండి అంతకుఏ మించిన ఆదరణ పొందుతుందని అది కలెక్షన్లు రూపంలో కనిపిస్తుందని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, శానిటైజర్ బాటిల్ను కూడా వెంట తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను ` అని తెలిపారు.
‘క్రాక్’ తమిళ చిత్రానికి రీమేక్ అని పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రం యదార్ధ సంఘటనల నుండి ప్రేరణ పొంది దర్శకుడు గోపీచంద్ మలినేని ఒరిజినల్ స్క్రిప్ట్ను అభివృద్ధి చేశారన్నారు. పినిమాలో తన పాత్ర గురించి వివరిస్తూ `నా పాత్ర మొదటి నుండి చివరి వరకు చాలా వినోదాత్మకంగా ఉంటుంది. ట్రైలర్లో సీరియస్ సైడ్ మాత్రమే చూపించాం కాని వెండితెరపై చాలా సరదాగా ఉంటుంది`అని రవితేజ తెలిపారు.
దర్శకుడు గోపీచంద్తో తనకిది మూడవ చిత్రం. దీనిపై రవితేజ మాట్లాడుతూ `పూరి జగన్నాధ్, శ్రీను వైట్ల తర్వాత నేను ఎక్కువగా పనిచేసినది గోపితోనే. మేము అలాంటిదేమీ ప్లాన్ చేయలేదు కాని అది అలా జరిగిపోయింది అంతే. మేము మళ్ళీ కలిసి పని చేయవచ్చు..
ఇదే సందర్భంగా రవితేజ తనయుడు మహాధన్ గురించి పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. రవితేజ మాట్లాడుతూ `అతను తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. తను సినిమాల్లోకి రావడం అన్నది ఇప్పుడే చర్చించడం టూ ఎర్లీ అవుతుంది. అంతేకాకుండా ఈ తరం పిల్లలు అన్ని విషయాల్లో చాలా ఫాస్ట్గా ఉన్నారు. వారికి ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలుసు` అని స్పష్టం చేశారు.