మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న, రిద్ది కుమార్, మేఘా చౌదరి హీరోయి హీరోయిన్ లు గా నటిస్తున్న చిత్రం `కోతి కొమ్మచ్చి`. `శతమానం భవతి` చిత్రంతో జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్న వేగేశ్న సతీష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎం.ఎల్.వి. సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మంగళవారం అమలాపురంలో మొదలైంది.
`కోతి కొమ్మచ్చి` చిత్రం ఈ రోజు నుంచి నిర్విరామంగా రెగ్యులర్ షూటింగ్ జరగబోతోంది. మంగళవారం నుంచి వారం రోజుల పాటు అమలాపురం పరిసర ప్రాంతాల్లో హీరోలు, హీరోయిన్లతో పాటు రాజేంద్రప్రసాద్, నరేష్ మిగతా తారగణంపై కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించబోతున్నాం. ఆ తరువాత వైజాగ్లో మిగతా సన్నివేశాలని తీయనున్నాం. యూత్ఫుల్ ఫన్ ఎంటర్టైనర్గా రాబోతున్న మా సినిమా అందరిని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం` అని దర్శకుడు వేగేశ్న సతీష్ అన్నారు.
మానవతా విలువలకు పెద్ద పీట వేస్తూ `శతమానం భవతి` వంటి చిత్రాన్ని అందించిన వేగేశ్న సతీష్ ఈ చిత్రాన్ని ఆద్యంతం అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ని ప్రారంభిస్తున్నాం, అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ మూవీ వుంటుంది. యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా ఆకట్టుకునే స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్వాలిటీతో చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తాం` అని నిర్మాత ఎం.ఎల్.వి. సత్యనారాయణ తెలిపారు.