
మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచానాలు నెలకొని ఉన్నాయి. ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాబోతుంది. ఈ తరుణంలో చిత్ర ప్రమోషన్ లలో బిజీ గా ఉన్నారు. కాగా ట్రైలర్ లో కానీ , చిత్ర ప్రీ రిలీజ్ వేడుక లో కానీ ఎక్కడ కూడా కాజల్ గురించి స్పందించకపోవడం తో అసలు కాజల్ ఉందా..? లేదా..? అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. దీనిపై డైరెక్టర్ కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు.
కొరటాల శివ ఈ వార్తలపై స్పందిస్తూ ఆచార్య సినిమాలో వచ్చే ‘లాహే లాహే’ అనే పాట అమ్మ వారి మీద వచ్చే పాటని, ఇదొక ట్రూప్ వచ్చి ధర్మస్థలిలో చెప్పే పాటగా ఉంటుందని వెల్లడించాడు. ఈ పాటలో కాజల్ కనిపిస్తుందని చెప్పాడు. అయితే ఈ చిత్రంలో ఈమె పాత్రను కామెడీ యాంగీల్లో రాసుకున్నానని, 4రోజులు కాజల్పై షూట్ను కూడా జరిపానని తెలిపాడు. కానీ అవుట్ పుట్ చూసాకా తనకున్న ఇమేజ్కు ఈ పాత్ర కరెక్టు కాదని తన సీన్స్ ఎడిట్ చేశానని తెలిపాడు. ఈ విషయం కాజల్ కూడా చెప్పాడని, తను కూడా అర్థం చేసుకుని ఒకే అని చెప్పిందట. ఇక ఈ చిత్రంలో పూజాహెగ్డే మాత్రమే హీరోయిన్గా నటించినట్లు క్లారిటీ ఇచ్చారు.