ఉప్పెనతో రికార్డులను షేక్ చేసిన మెగా హీరో వైష్ణవ్ తేజ్ చేసిన రెండో సినిమా కొండ పొలం. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా చేసింది. కొండ పొలం సినిమా షూటింగ్ గతేడాదే పూర్తవ్వగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం, కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల పనుల్లో జాప్యం అవుతూ వచ్చింది.
రీసెంట్ గా కొండ పొలం నుండి ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ కూడా విడుదలయ్యాయి. వాటికి రెస్పాన్స్ బాగుంది. వైష్ణవ్ తేజ్ గొర్రెల కాపరిగా ఈ చిత్రంలో నటించాడు. అయితే ఫస్ట్ సాంగ్ విడుదలయ్యాక మళ్ళీ మరో అప్డేట్ రాలేదు. మరోవైపు అక్టోబర్ 8న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో సినిమా రిలీజ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.
అయితే కొండ పొలం నుండి ఎదురుచూస్తోన్న అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. సోమవారం, 27 సెప్టెంబర్ నాడు మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషాలకు కొండ పొలం ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.