Homeటాప్ స్టోరీస్షాకింగ్ కలెక్షన్స్ తో నిరుత్సాహపరిచిన కొండ పొలం

షాకింగ్ కలెక్షన్స్ తో నిరుత్సాహపరిచిన కొండ పొలం

షాకింగ్ కలెక్షన్స్ తో నిరుత్సాహపరిచిన కొండ పొలం
షాకింగ్ కలెక్షన్స్ తో నిరుత్సాహపరిచిన కొండ పొలం

ఉప్పెన చిత్రంతో సెన్సేషన్ సృష్టించాడు వైష్ణవ్ తేజ్. తొలి చిత్రంతోనే 25 కోట్ల షేర్ ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఉప్పెన చిత్రానికి ముందు బిల్డ్ అయిన హైప్ వేరే లెవెల్లో ఉంది. అది కలెక్షన్స్ ను తీసుకురావడంలో దోహదపడింది. అదే వైష్ణవ్ రెండో సినిమాలో కొరవడింది. వైష్ణవ్ తేజ్ క్రిష్ దర్శకత్వంలో నటించిన కొండ పొలం గత వారాంతం థియేటర్లలో విడుదలైంది. మొదటి వారాంతం గడిచినా ఈ చిత్రం కనీసం 3 కోట్ల షేర్ ను కూడా అందుకోకపోవడం గమనార్హం.

ఈ కలెక్షన్స్ తో నిర్మాతలు షాక్ అయ్యారు. దీనిపై మంచి అంచనాలే పెట్టుకున్నారు. ఈరోజుల్లో ఏ సినిమా బజ్ లో ఉండాలన్నా ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ తప్పనిసరి. ఉప్పెన సినిమా అంతటా అలాంటి పాటలతో నింపేసాడు దేవి శ్రీ ప్రసాద్. కొండ పొలం చిత్రానికి అదే లేకుండా పోయింది. పైగా మొదటి నుండి ఇది ఒక ఆర్ట్ సినిమా అన్నట్లుగా భావన ప్రేక్షకులలో ఏర్పడింది. టాక్ కూడా అంత పాజిటివ్ గా రాలేదు.

- Advertisement -

మొత్తంగా కొండ పొలం అందరికీ నిరుత్సాహాన్ని నింపిన చిత్రంగా మిగిలింది. వీకెండ్స్ లోనే డల్ అయిన ఈ చిత్రం వీక్ డేస్ కలెక్షన్స్ పై ఎవరికీ ఎటువంటి అంచనాలు లేవు. క్రిష్ ఈ చితీరాన్ని తెరకెక్కించగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా చేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All