`మహానటి` చిత్రంలో తెలుగులో బయోపిక్ల పరంపర మొదలైంది. త్వరలోనే మరో బయోపిక్ తెరపైకి రాబోతోంది. శ్రీకాకుళంకు చెందిన సాధారణ మహిళ కరణం మల్లేశ్వరి అంతర్జాతీయ స్థాయిలో దేశ పతాకాన్ని రెపరెపలాడించారు. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్కు పతాకాన్ని సాధించిన తొలి మహిళా వెయిట్ లిప్టర్గా చరిత్ర సృష్టించారు.
ఆమె జీవిత కథ ఆధారంగా బయోపిక్ని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై ఎం.వి.వి. సత్యనారాయణ, రచయిత కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంజన రెడ్డి దర్శకత్వం వహించనున్నారు.
సోమవారం కరణం మల్లేశ్వరి పుట్టిన రోజు సందర్భంగా బయోపిక్ని నిర్మించబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ఈ చిత్రం నిర్మితం కానుంది., కోన వెంకట్ కథ, మాటలు అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధిఒంచిన మరిన్ని వివరాల్ని చిత్ర బీందం త్వరలోనే వెల్లడించనున్నట్టు తెలిసింది.