ప్రస్తుతం బాలీవుడ్లో అత్యంత బిజీగా వున్న హీరోయిన్లలో మహేష్ హీరోయిన్ కియారా అద్వానీ ఒకరు. లస్ట్ స్టోరీస్, కబీర్ సింగ్ , గుడ్ న్యూజ్ వంటి వరుస విజయాల తరువాత కియారా హిందీ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ ల జాబితాలో చేరిపోయింది. సోషల్ మీడియాలో కూడా కియారాకు చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్ స్టా వేదికగా 1142 పోస్ట్లతో అభిమానుల్ని అలరిస్తోంది కియారా.
ఆమెని ఫాలో అవుతున్న వారి సంఖ్య భారీగానే వుంది. 16.8 మిలియన్ ఫాలోవర్స్ కియారా సొంతం. అంతగా తన హాట్ ఫొటోలతో సినిమాతో పాపులర్ అయిపోయింది. మహేష్ హీరోగా నటించిన `భరత్ అనే నేను` చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కియారా ఆ తరువాత రామ్చరణ్తో `వినయ విధేయ రామ` చేసింది. కానీ ఫలితం మాత్రం శూన్యం. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్గా నిలిచింది.
ఇదిలా వుంటే తన అందమైన చిత్రాఫొటోలను ఇన్స్టాగ్రామ్లో క్రమం తప్పకుండా పంచుకోవడం ద్వారా అభిమానులనుకు ఐఫీస్ట్ని కలిగిస్తోంది. తన హాట్ హాట్ అందాలతో అభిమానుల్ని సంతృప్తిపరుస్తోంది. ఈ రోజు కియారా ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫొటో వైరల్గా మారింది. బ్లాక్ డ్రెస్లో అందాల విందు చేస్తూ కియారా ఫొటోలకి పోజులిచ్చిన స్టిల్ ఆకట్టుకుంటూ ఇన్ స్టాని హీటెక్కిస్తోంది. కియారా ఈ ఏడాది చివరి సారిగా `ఇందూ కి జవానీ` చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె `షేర్షా` విడుదల కోసం ఎదురుచూస్తోంది. విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటించారు. కియారా భూల్ భూలైయా 2, జగ్ జగ్ జీయో చిత్రాల్లో నటిస్తోంది.
View this post on Instagram