అతిలోకసుందరి శ్రీదేవి వారసుల గురించి గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. ఆమె పెద్ద కుమార్తె జాన్వీకపూర్ ఇప్పటికే తెరంగేట్రం చేసింది. ప్రస్తుతం పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది కూడా. ఆమె తరువాత చిన్న కుమార్తె ఖుషీ కపూర్ కూడా సినిమాల్లోకి అరంగేట్రం చేయబోతోంది. ప్రస్తుతం నటనలో శిక్షణ తీసుకుంటున్నారామె.
గత కొంత కాలంగా ఆమెని నెటిజన్స్ వేధిస్తున్నారట. తల్లి శ్రీదేవి పోలీకలు తనకు రాలేదని పలువురు జోకులు వేస్తున్నారని భావోద్వేగానికి గురవుతూ ఓ ఆడియోని పంచుకుంది ఖుషీకపూర్. నేను ఓ వ్యక్తిగా ఎంత వున్నతంగా వుండాలనుకున్నానో ప్రస్తుతం అలా తాను లేనని, కానీ రోజు రోజుకీ ఎదుగుతున్నా. కొందరు అమితమైన ప్రేమని కురిపించడం, ప్రశంసించడం ఓ బహుమతిలా భావిస్తున్నాను. అయితే దీనికి నేను అర్హురాలిని కాదు. అంత గొప్ప పనిని తాను ఇంకా చేయలేదని, ఒక వేళ ఇతరుల్ని సంతోషంగా శక్తి తనకు ఉంటే అప్పుడు ఈ ప్రశంసలకు అర్థం వుంటుంది` అని పేర్కొంది.
ఇప్పటికీ తనని కొంత మంది అభిమానులు విమర్శిస్తున్నారు. నాకు భయం, సిగ్గు ఎక్కువ. చిన్నతనంలోనే ఇలాంటి విద్వేషపూరిత మాటలు వింటే బాధగా అనిపిస్తోంది. తానూ అందరి లాంటి అమ్మాయినే నని చెప్పాలని పిస్తోందని, ఇలాంటి విమర్శల్ని ఎలా ఎదుర్కోవాలో తనకు ఒక్కోసారి అర్థం కాదని చెప్పింది ఖుషీకపూర్.