Homeటాప్ స్టోరీస్ఖిలాడీ షెడ్యూల్ లో కీలక మార్పులు

ఖిలాడీ షెడ్యూల్ లో కీలక మార్పులు

ఖిలాడీ షెడ్యూల్ లో కీలక మార్పులు
ఖిలాడీ షెడ్యూల్ లో కీలక మార్పులు

మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ సాధించి తిరిగి ఫామ్ లోకి వచ్చిన విషయం తెల్సిందే. క్రాక్ తర్వాత షార్ట్ గ్యాప్ లో ఖిలాడీ చిత్రాన్ని మొదలుపెట్టాడు. జెట్ స్పీడ్ లో ఈ సినిమా షూటింగ్ ను దాదాపు చేసాడు. తాజా సమాచారం ప్రకారం ఖిలాడీ చిత్ర లాస్ట్ షెడ్యూల్ ను దుబాయ్ లో ప్లాన్ చేసారు. అక్కడ రెండు సాంగ్స్, కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేయాలని అనుకున్నారు.

అక్కడ యూఏఈ ప్రభుత్వ అధికారులు కోవిడ్ పరిస్థితి కారణంగా షూటింగుల నిమిత్తం పెర్మిషన్స్ ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో ఖిలాడీ షెడ్యూల్ లో మార్పులు జరిగాయి. హైదరాబాద్ లోనే భారీ సెట్ వేసి షూటింగ్ ను కొనసాగిస్తారు. అయితే రవితేజకు సంబంధించి కొన్ని సన్నివేశాలను మాత్రం దుబాయ్ లోనే ముందు అనుకున్న పద్దతి ప్రకారమే షూటింగ్ చేస్తారట. కథ ప్రకారం రవితేజ ఈ చిత్రంలో దుబాయ్ నుండి వచ్చే వ్యక్తిగా కనిపిస్తాడట.

- Advertisement -

రమేష్ వర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All