మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ ఎంత పెద్ద హిట్ అయింది అన్నది మనం చూసాం. ఈ సినిమాకు ముందు రవితేజకు అన్నీ ప్లాపులే కాగా క్రాక్ తో కథ మొత్తం మారిపోయింది. బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సాధించాడు. క్రాక్ చిత్రం తర్వాత రవితేజ చేస్తోన్న సినిమా ఖిలాడీ. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.
ప్రస్తుతం అందరూ తమ సినిమా రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్న నేపథ్యంలో ఖిలాడీ కూడా రేసులోకి వచ్చేసాడు. ఈ సినిమాను మే 28న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మే నెలలో ఆచార్య, నారప్పలతో పాటు రవితేజ కూడా సందడి చేయనున్నాడు అన్నమాట.
మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నాడు. మరి క్రాక్ తో వచ్చిన విజయాన్ని ఖిలాడీతో కొనసాగిస్తాడా లేదా అన్నది చూడాలి.