సైలెంట్గా వచ్చి సంచలనం సృష్టించిన చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ -1`. కన్నడలక్ష రాక్స్టార్ యష్ హీరోగా నటించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రికార్డు సృష్టించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హంబలే ఫిలింస్ అత్యత భారీ బడ్జెట్తో చేసిన సాహసం హీరో యష్ని పాన్ ఇండియా స్టార్ని చేసింది. ఈ సినిమా తరువాత కన్నడ చిత్ర పరిశ్రమలో సాధిరణ హీరోగా వున్న యష్ రాత్రికి రాత్రి క్రేజీ స్టార్ల జాబితానే మించిపోయాడు. కోలార్ గోల్డ్ మైన్స్, ముంబై నేర సామ్రాజ్యం నేపథ్యంలో ఆద్యంతం ఉత్రంఠభరితమైన కథా కథనాలతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు ప్రతీ ఒక్కరినీ అబ్బురపరిచింది.
ఐదు భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 238 కోట్లు వసూలు చేసి కన్నడ చలన చిత్ర చరిత్రలోనే సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. లాజాగా ఈ చిత్రానికి సంబంధించిన `కేజీఎఫ్ పార్ట్ -2` చిత్రీకరణ జరుపుకుంటోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రానిక సంబంధించిన కీలక ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. అధీరా తమ్ముడు గరుడని రాఖీ అంతం చేయడంతో పార్ట్ వన్ కు తెరపడింది. అయితే అక్కడి నుంచే పార్ట్ 2 మొదలు కాబోతోంది. ఇందులో అధీరాగా సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనుండగా, మాజీ ప్రధాని ఇందిరా గాంధీని పోలిన పాత్రలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ నటిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా మేకింగ్ పరంగా హాలీవుడ్ చిత్రాన్ని తలపించిన ఈ సినిమా రెండవ పార్ట్పై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో సినిమా వుంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన వార్తని దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. డిసెంబర్ 21న సాయంత్రం 5:45 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి రవి బాస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
Perfect time for celebrations!!!!
We are absolutely elated to unveil the #KGFChapter2 First Look on Dec 21st.#KGFChapter2FirstLook @TheNameIsYash @prashanth_neel@duttsanjay @VKiragandur @SrinidhiShetty7 @bhuvangowda84 @BasrurRavi @hombalefilms pic.twitter.com/vKSFrWRjEM
— Prashanth Neel (@prashanth_neel) December 14, 2019
Credit: Twitter