Homeగాసిప్స్ఓటీటీ బాట‌లో కీర్తి సురేష్ మ‌రో చిత్రం?

ఓటీటీ బాట‌లో కీర్తి సురేష్ మ‌రో చిత్రం?

ఓటీటీ బాట‌లో కీర్తి సురేష్ మ‌రో చిత్రం?
ఓటీటీ బాట‌లో కీర్తి సురేష్ మ‌రో చిత్రం?

క‌రోనా కార‌ణంగా దేశ వ్యాప్తంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సినిమా షూటింగ్‌లపై సానుకూలంగా స్పందించ‌డంతో జూన్ నుంచి షూటింగ్‌లు ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఇప్పికే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు షూటింగ్‌ల‌కు సంబంధించి సూచ‌న ప్రాయంగా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేయ‌డంతో వ‌రుస షూటింగ్‌లు త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతున్నాయి.

ఇదిలా వుంటే థియేట‌ర్ల పునః ప్రారంభం కోసం మాత్రం మ‌రి కొన్ని నెల‌లు వేచి చూడాల్సిందే అని తెలుస్తోంది. దీనిపై ప్ర‌భుత్వ పెద్ద‌లు కూడా సానుకూలంగా స్పందించ‌డం లేదు. మ‌రి కొంత కాలం వేచి చూడ‌క త‌ప్ప‌ద‌ని ఇండైరెక్ట్‌గా చెబుతున్నారు. దీంతో రిలీజ్‌కి రెడీగా వున్న సినిమాలు ఓటీటీ దారి ప‌డుతున్నాయి.

- Advertisement -

ఇప్ప‌టికే కీర్తి సురేష్ న‌టించిన `పెంగ్విన్‌` చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 19న డైరెక్ట్ రిలీజ్ కాబోతోంది. దీనితో పాటు కీర్తి సురేష్ న‌టించిన మ‌రో చిత్రం కూడా ఓటీటీ బాట‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. న‌రేంద్ర‌నాథ్‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న చిత్రం `మిస్ ఇండియా`. ఏప్రిల్ 17న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. క‌రోనా కార‌ణంగా రిలీజ్ వాయిదా వేయాల్సి వ‌చ్చింది. తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని డైరెక్ట్‌గా నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. అది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాలంటే నిర్మాత స్పందించాల్సిందే. జ‌గ‌ప‌తిబాబు, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, న‌దియా కీల‌క పాత్ర‌ల్లో నటించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All