Homeగాసిప్స్కీర్తిసురేష్ సినిమా వివాదం ఆగ‌దా?

కీర్తిసురేష్ సినిమా వివాదం ఆగ‌దా?

కీర్తిసురేష్ సినిమా వివాదం ఆగ‌దా?
కీర్తిసురేష్ సినిమా వివాదం ఆగ‌దా?

కీర్తి సురేష్ తెలుగులో స్టార్ హీరోయిన్ స్థానాన్ని ద‌క్కించుకున్నా ఇప్ప‌టికీ ఆమె తెలుగులో న‌టించిన తొలి చిత్రం విడుద‌ల‌కు నోచుకోవ‌డం లేదు. సీనియ‌ర్ న‌రేష్ త‌న‌యుడు విజ‌య్‌కృష్ణ న‌వీన్‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ చంటీ అడ్డాల ఓ చిత్రాన్ని ప్రారంభించారు. `జాన‌కితో నేను` అనే టైటిల్ ని అనుకున్నారు. త‌న‌యుడి తొలి సినిమా కావ‌డంతో న‌రేష్ కూడా ముందుకొచ్చి ఈ మూవీ గురించి ప్ర‌చారం చేశారు.

కొంత కాలం ఈ మూవీ కొన్ని కార‌ణాల వ‌ల్ల  ఆగిపోయింది. ఆ త‌రువాత ఈ మూవీకి `అయినా ఇష్టం నువ్వు` అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. త‌రువాతే సీన్ మారింది నిర్మాతా మారాడు. చంటి అడ్డాల ప్లేస్‌లో న‌ట్టికుమార్ వ‌చ్చారు. చేతులు మారిన ఈ మూవీ రిలీజ్ కు ఆప‌సోపాలు ప‌డుతోంది. తాజాగా ఈ చిత్రానికి `రెండు జ‌డ‌ల సీత` అనే టైటిల్‌ని అనుకుంటున్నార‌ట‌.

- Advertisement -

`మ‌హాన‌టి` త‌రువాత కీర్తిసురేష్‌కు తెలుగు, త‌మిళ భాష‌ల్లో మంచి క్రేజ్ ఏర్ప‌డ‌టంతో ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలని న‌ట్టికుమార్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ మూవీని త‌ను ఎవ‌రికీ ఇవ్వ‌లేద‌ని చంటీ అడ్డాల వాదిస్తుంటే న‌ట్టికుమార్ మాత్రం త‌న‌కు అమ్మేశార‌ని సాక్ష్యాలు చూపిస్తున్నారు. పోలీస్టేష‌న్ వ‌ర‌కు వెళ్లిన ఈ పంచాయితీ ఇప్ప‌ట్లో తీరేలా క‌నిపించ‌డం లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All