Homeటాప్ స్టోరీస్కీర్తి కిరీటంలో మ‌రో పుర‌స్కారం!

కీర్తి కిరీటంలో మ‌రో పుర‌స్కారం!

కీర్తి కిరీటంలో మ‌రో పుర‌స్కారం!
కీర్తి కిరీటంలో మ‌రో పుర‌స్కారం!

కీర్తిసురేష్ కీర్తి కిరీటంలో మ‌రో పుర‌స్కారం వ‌చ్చి చేరింది. శ‌నివారం చెన్నైలో జ‌రిగిన సౌత్ ఇండియ‌న్‌ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో కీర్తి సురేష్‌కు ఉత్త‌మ న‌టి పుర‌స్కారం ల‌భించింది. మ‌హాన‌టిసావిత్రి జీవిత క‌థ ఆధారంగా `మ‌హాన‌టి` పేరుతో ఓ చిత్రం రూపొందిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో మ‌హాన‌టిగా అస‌మాన ప్ర‌తిభ‌ను న‌టి కీర్తి సురేష్ ప్ర‌ద‌ర్శించి విమర్శ‌కులను ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ఈ చిత్రం కోసం ముందు సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్‌ని ఎంపిక చేశామ‌ని చిత్ర వ‌ర్గాలు ప్ర‌క‌టించిన తొలి రోజు నుంచి కీర్తిసురేష్‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన విష‌యం తెలిసిందే.

న‌ట‌నే రాదు, బొద్దుగా వుంటుంది. ఇలాంటి న‌టిని మ‌హాన‌టి సావిత్రి పాత్ర కోసం ఏ సాహ‌సంతో తీసుకుంటున్నారు? మేక‌ర్స్ అభాసు పాలు కావ‌డం ఖాయం.. వంటి విమ‌ర్శ‌లు జోరుగా వినిపించాయి. అయితే వాట‌న్నింటినీ త‌న చురున‌వ్వుతోనే స‌మాధానం చెప్పిన కీర్తి సురేష్ తెర‌పై త‌న న‌ట‌న‌తో విమ‌ర్శ‌కుల నోళ్లు మూయించి ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. తెర‌పై కీర్తి సురేష్ కాకుండా స్వ‌యంగా మ‌హాన‌టి సావిత్ర‌మ్మే ఆమెలో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి త‌న పాత్ర‌కు ప్రాణ ప్ర‌తిష్ట చేసుకుందా? అనేంత‌గా సావిత్రి పాత్ర‌ను కీర్తిసురేష్ ర‌క్తిక‌ట్టించింది.

- Advertisement -

మ‌హాన‌టి సావిత్రిగా కీర్తి సురేష్ ప్ర‌ద‌ర్శించిన అస‌మాన న‌ట‌న‌కు ముగ్ధులైన ఆమెకు జాతీయ అవార్డుని అందించిన విష‌యం తెలిసిందే తాజాగా `మ‌హాన‌టి` చిత్రానికి గానూ కీర్తి సురేష్ ఫిల్మ్ ఫేర్ పుర‌స్క‌రాన్ని సొంతం చేసుకుంది. ఆమెతో పాటు ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా నాగ్ అశ్విన్ ఫిల్మ్‌ఫేర్‌ని ద‌క్కించుకున్నారు. దీంతో విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న `మ‌హాన‌టి` టీమ్ వ‌రుస పుర‌స్కారాల్ని అందుకుంటూ త‌న అవార్డుల జైత్ర యాత్ర‌ని కొన‌సాగిస్తోంద‌ని టాలీవుడ్‌, కోలీవుడ్ స్టార్స్ ప్ర‌శంస‌ల్లో ముంచెత్తుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All