నేటి తరంలో ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరుగా మారింది కీర్తి సురేష్. ముఖ్యంగా మహానటి చిత్రం తర్వాత ఈమెకు అవకాశాలు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి వంటి చిత్రాలను చేసింది. అయితే వీటి సక్సెస్ సంగతి పక్కనపెడితే ఇప్పుడు కీర్తి సురేష్ కు మరో అవకాశం వచ్చింది.
ఇటీవలే రూపొందిన హిందీ చిత్రం మిమీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. 1 నేనొక్కడినే ఫేమ్ కృతి సనన్ సరోగేట్ తల్లిగా అద్భుతమైన నటన కనబర్చింది. ఈ సినిమా రీమేక్ లో నటించమంటూ ఓ నిర్మాణ సంస్థ కీర్తి సురేష్ ను అప్రోచ్ అయింది. అయితే కీర్తి ఇంకా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ప్రస్తుతం ఈ భామ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాటలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలవుతుంది. పరశురామ్ దర్శకుడు.