తేజ ఏది చేసినా సంచలనమే. కెరీర్ తొలి నాళ్లలో తన సినిమాల్లో నటించే ఆర్తిస్ట్లని మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తూ వార్తల్లో నిలిచిన తేజ దర్శకుడిగా క్రేజ్తో పాటు వరుస విజయాల్ని కూడా అదే స్థాయిలో సొంతం చేసుకున్నారు. గత కొంత కాలంగా తేజ్ క్రేజ్ తగ్గింది. వరుసగా సినిమాలు ఫ్లాప్లు కావడం మొదలైంది. ఆ సమయంలో తేజ `నేనే రాజు నేను మంత్రి` చిత్రంతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
అయితే ఆ తరువాత చేసిన `సీత` ఆకట్టుకోలేకపోయింది. మళ్లీ తేజ కెరియర్ మొదటికే వచ్చిందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. వాటికి షకిస్తూ తేజ బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాల్ని ప్రకటించారు. గోపీచంద్తో `అలిమేలు మంగ వెంకటర రమణ`, రానాతో `రాక్షస రాజు రావణాసురుడు` చేయబోతున్నారు. ఇందులో ముందుగా గోపీచంద్తో `అలిమేలు మంగ వెంకటర రమణ` చిత్రాన్ని ప్రారంభించబోతున్నారట.
ఇందు కోసం హీరోయిన్ని గత కొన్ని రోజులుగా అన్వేషిస్తున్న తేజ చివరికి `మహానటి`తో విమర్శకులకు షాకిచ్చిన కీర్తి సురేష్ని అలిమేలు మంగ పాత్రకు ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. పాత్ర నచ్చడంతో కీర్తి కూడా తేజ చిత్రంలో నటించడానికి అంగీకరించినట్టు చిత్ర వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్పైకి తీసుకురాబోతున్నారట.