సావిత్రి జీవిత కథ ఆధారంగా తెర కెక్కిన చిత్రం ‘ మహానటి‘. ఈ సినిమా తరువాత కీర్తి సురేష్ కు మాంచి డిమాండ్ తో పాటు పేరు లభించింది. ఈ సినిమా తరువాత నుంచి పారితోధికం భారీగా పెంచేసింది.
లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తున్న కీర్తి సురేష్ తెలుగులో నితిన్ హీరోగా నటిస్తున్న సినిమాతో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తమిళ చిత్రం ‘ అన్నతే ‘ లోనూ నటిస్తోంది.
ఇదిలావుంటే తాజా పరిస్థుతుల నేపథ్యంలో తన పారితోషికాన్ని 30 శాతం తగ్గించుకుంటోదట. నితిన్ సినిమా ‘రంగ్ దే ‘ షూటింగ్ ని పూర్తి చేసుకున్న కీర్తి సురేష్ ఇకపై చేయబోయే సినిమాలకు 30 శాతం పారితోషికం తగ్గించుకోనుందని తెలిసింది.
- Advertisement -