నితిన్ హీరోగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ `రంగ్ దే`. వెంకీ అట్లూరి దర్శకుడు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై యంగ్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. రొమాంటిక్ లవ్స్టోరీగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 26న వరల్డ్ వైడ్గా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి రాజమండ్రిలో ఈ చిత్ర గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ని చిత్ర బృందం నిర్వహించింది.
ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ `రంగ్ దే` ఇదొక మంయి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. ఈ బ్యానర్లో నాకిది మూడవ సినిమా. అఆ, భీష్మ ఇప్పుడు `రంగ్ దే`. ఈ రెండు చిత్రాల్లాగే ఈ సినిమా కూడా ఆడాలని కోరుకుంటున్నాను. రాజమండ్రికి `భీష్మ` షూటింగ్ కోసం వచ్చాను. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడ `రంగ్ దే` కోసం వచ్చాను. ఆ సెంటిమెంట్ రిపీట్ కావాలని కోరుకుంటున్నాను. డీఎస్పీతో తొలిసారకి వర్క్ చేశాను. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సాంగ్స్ చాలా రోజుల వరకు గుర్తుంటాయి. సినిమా రిలీజ్ తరువాత చాలా పెద్ద హిట్ అవుతాయి. మన కాంబినేషన్ ఇలాగే కొనసాగాలి. కీర్తి చాలా మంచి నటి. ఈ సినిమాలో చాలా బాగా నటించింది. తన రియల్ క్యారెక్టరే ఇది. అందరిని టార్చర్ పెడుతుంటుంది. అది చూసి వెంకీ ఈ కథ రాశాడు` అన్నారు.
కీర్తి సురేష్ మాట్లాడుతూ `రొమాంటిక్ సినిమా ఇచ్చినందుకు వెంకీకీ థ్యాంక్స్. డీఎస్పీతో ఇది నా మూడవ చిత్రం. హ్యాట్రిక్ అవుతుందని ఎదురుచూస్తున్నాను. నితిన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కో స్టార్. ఒక విషయం చెప్పాలి. ట్రైలర్ చూస్తే నేను విలన్లా కనిపిస్తున్నాను. అది అబద్ధం. నితినే విలన్. సెకండ్ హాఫ్లో నేను రివేంజ్ తీర్చుకుంటాను. అది మాత్రమే ట్రైలర్లో వుంది. అది చూసి మరోలా అనుకోవద్దు. థియేటర్లలో సినిమా చూసి నిజం ఏంటో తెలుసుకోండి. థియేటర్స్కి వెళ్లి సినిమా చూడండి` అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వెంకీ అట్లూరి, దేవిశ్రీప్రసాద్, టి టైమ్ ఉదయ్, కాళీతేజ్, అవినాష్ కొల్ల తదితరులు పాల్గొన్నారు.