తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముగ్గురు సిట్టింగ్ పార్లమెంట్ సభ్యులకు షాక్ ఇచ్చాడు . ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడు జితేందర్ రెడ్డి , మహబూబబాద్ పార్లమెంట్ సభ్యుడు సీతారాం నాయక్ లకు టికెట్లు నిరాకరించారు. అలాగే పెద్దపల్లి నుండి అవకాశం వస్తుందని భావించిన వివేక్ కు కూడా గట్టి షాక్ తగిలింది . ఆ సీటుని మరొకరికి కేటాయించడంతో ఖంగుతిన్నారు . ఎంతోమంది ఆశావహులు తమకే టికెట్లు వస్తాయని ఆశపడిన వాళ్లకు కోలుకోలేని దెబ్బ కొట్టాడు పలు చోట్ల కొత్త ముఖాలను దించి సంచలనం సృష్టించాడు కేసీఆర్ .
టీఆర్ఎస్ ప్రకటించిన 17 పార్లమెంట్ స్థానాలు ఇవే !
1) ఆదిలాబాద్ – గెడెం నగేష్
2) భువనగిరి – డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
3) హైద్రాబాద్ – పుస్తె శ్రీకాంత్
4) చేవెళ్ల – డాక్టర్ రంజిత్ రెడ్డి
5) కరీంనగర్ – వినోద్ కుమార్
6) నిజామాబాద్ – కల్వకుంట్ల కవిత
7) ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు
8) సికింద్రాబాద్ – తలసాని సాయి కిరణ్ యాదవ్
9) మల్కాజ్ గిరి – మర్రి రాజశేఖర్ రెడ్డి
10) మహబూబ బాద్ – మాలోతు కవిత
11) మహబూబ్ నగర్ – మన్నే శ్రీనివాస్ రెడ్డి
12) మెదక్ – కొత్త ప్రభాకర్ రెడ్డి
13) నాగర్ కర్నూల్ – పి . రాములు
14) నల్గొండ – వి. నర్సింహా రెడ్డి
15) పెద్దపల్లి – వెంకటేష్ నేతకాని
16) వరంగల్ – పసునూరి దయాకర్
17) జహీరాబాద్ – బిబి పాటిల్
English Title: KCR announces Lok Sabha candidates for 17 seats in Telangana