విశాల్ హీరోగా పీఎస్ మిత్రన్ తెరకెక్కించిన చిత్రం `అభిమన్యుడు`. సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సగటు ప్రేక్షకుడితో పాటు విమర్శకులని సైతం ఆలోచింపజేయడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయాన్ని సాధించింది. యాక్షన్ కింగ్ అర్జున్ స్టైలిష్ విలన్ గా నటించారు. పీఎస్ మిత్రన్ కు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. తొలి చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింని దక్కించుకున్నారు.
ఆ తరువాత శివకార్తికేయన్తో `హీరో` చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదే సినిమాని తెలుగులో `శక్తి` పేరుతో విడుదల చేశారు. తాజాగా ఆయన మూడవ చిత్రాన్ని హీరో కార్తితో చేస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో రూపొందనున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు దీపావళి సందర్భంగా శనివారం చెన్నైలోని సంస్థ కార్యాలయంలో జరిగాయి. ఇదే రోజు సాంగ్స్ రికార్డింగ్ కూడా ప్రారంభించారు.
ఈ చిత్రానికి జీవి. ప్రకాష్కుమార్ సంగీతం అందించబోతున్నారు. జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫీని, రుబెన్ ఎడిటింగ్, కదిర్ ఆర్ట్ అందిస్తున్నారు. రేసీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని చిత్ర బృందం త్వరలో ప్రకటించనుంది. ఈ చిత్రానకి `స్టార్` అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు. కార్తి ప్రస్తుతం `సుల్తాన్` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.