Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ నమ్మక ద్రోహం చేస్తున్నాడట

పవన్ కళ్యాణ్ నమ్మక ద్రోహం చేస్తున్నాడట

kapunadu leader sensational comments on pawan kalyanజనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు కులస్థులకు తీరని నమ్మక ద్రోహం చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ కాపునాడు అధ్యక్షుడు పిళ్ళా వెంకటేశ్వర్రావు . బిజెపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఎన్నో హామీలను ఇచ్చి అమలు పరచకపోగా పవన్ కళ్యాణ్ ని అడ్డుపెట్టుకొని ఆరోపణలు చేయించడం , బిజెపి ఆడమన్నట్లు పవన్ కళ్యాణ్ ఆడుతూ చంద్రబాబు ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం చూస్తుంటే పవన్ కళ్యాణ్ మరోసారి కాపులను మోసం చేయడానికే పూనుకున్నట్లు కనిపిస్తోందని అన్నారు .

 

- Advertisement -

ఇప్పటికే చిరంజీవి రూపంలో కాపులు తల ఎత్తుకోలేక పోతున్నారని ఇక ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ రూపంలో మరోసారి కాపులకు నమ్మక ద్రోహం చేయడానికి వచ్చాడని అంటున్నాడు కాపునాడు నేత . కేంద్ర ప్రభుత్వం పై పోరాడుతున్న చంద్రబాబు కు మద్దతు ఇవ్వాల్సిన ఈ తరుణంలో పవన్ వ్యవహారశైలి కంపరంగా ఉందని అన్నారు పిళ్ళా వెంకటేశ్వర్ రావు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All