గత కొన్ని రోజులుగా నిత్యం వివాదాస్పద అంశాలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు మధ్య ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి నుంచి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. శివసేన పార్టీ నేతల విమర్శలపై స్పందించిన కంగన ముంబై అక్కమిత కశ్మీర్గా మారిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే .
ఇక్కడి నుంచే మహా ప్రభుత్వానికి కంగనకు మధ్య వార్ మొదలైంది. అది ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. తాజాగా కంగనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే విజయదశమి సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. దీనిపై తాజాగా కంగన స్పందించింది. `సొంత రాష్ట్రంలో తిండికి గతిలేని వారు ముంబై డబ్బు సంపాదించుకుని తిన్నింటి వాసాలే లెక్కపెడుతున్నారని ఉద్ధవ్ చేసిన వ్యాఖ్యలపై కండన మండిపడ్డారు. హిమాలయాల సౌందర్యం అందరికి చెందినట్టే ముంబై ఇచ్చే అవకాశాలు కూడా అందరనికి చెందుతాయని చురకలు అంటించింది.
హిమాచల్ ప్రదేశ్ ఎంతో తనకు ముంబై కూడా అంతేనని, తనకు ఇవి రెండిళ్లని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి స్థానంలో వున్న ఓ వ్యక్తి పండగపూట ఓ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసి మహారాష్ట్ర పరువుతాశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తను నెపోటిజమ్ బ్రాండ్ ని కాదని, స్వశక్తితో, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌనవంతో ఎదిగానని మీలా వారసత్వంతో అధికారంలోకి రాలేదని చురకలంటించింది. ప్రజాస్వామ్య హక్కుల్ని హరించే సాహసం చేయొద్దని సీఎంకు హితవు పలికింది. మమ్మల్ని వేరు చేసి చూడొద్దని హెచ్చిరించింది. కూతరులాంటి తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి సిగ్గుండాలని ఘాటుగా విమర్శించింది.