దర్శకులు క్రిష్ తో నాకు గొడవలు ఉన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది కానీ అవన్నీ గాలి వార్తలేనని ,నాకు క్రిష్ కు మధ్య విబేధాలు లేవని మేమిద్దరం తరచుగా సినిమా కోసం మాట్లాడుకుంటూనే ఉన్నామని అంటోంది వివాదాస్పద హీరోయిన్ కంగనా రనౌత్ . తెలుగు దర్శకుడు జాగర్లమూడి క్రిష్ బాలీవుడ్ చిత్రమైన ” మణికర్ణిక ” చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే . వీరనారి ఝాన్సీ లక్ష్మీ భాయ్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది అయితే కొన్ని సన్నివేశాలు బాగోలేవని మళ్ళీ రీ షూట్ చేయాలనీ భావించాడు క్రిష్ అయితే కంగనా రనౌత్ మాత్రం ఆ విషయంలో క్రిష్ పట్ల ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం .
అయితే అల్టిమేట్ గా ఔట్ ఫుట్ బాగుండాలి కాబట్టి కంగనా రనౌత్ క్రిష్ చెప్పిన దానికి కన్విన్స్ అయ్యిందట ! అయితే మొదట అతడి పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది కాబట్టి ఆ లీకులు బయటకు రావడంతో క్రిష్ – కంగనా ల మధ్య వార్ జరుగుతోందని ప్రచారం సాగింది కట్ చేస్తే అది సోషల్ మీడియాకి ఎక్కడంతో ఇద్దరినీ ఇబ్బంది పెట్టింది అందుకే కంగనా స్పందించాల్సి వచ్చింది . మొత్తానికి కంగనా కన్విన్స్ అయ్యింది కాబట్టి మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత గ్రాఫిక్స్ కూడా చూసుకొని అప్పుడు మణికర్ణిక చిత్రాన్ని విడుదల చేయనున్నారు .
English Title: kangana ranaut says no clashes with director krish