మోబైల్ ఫోన్స్, టెక్నాలజీ వాడకం పెరిగిపోవడంతో ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. దీంతో ప్రాధమ్యాలు కూడా మారిపోతున్నాయి. థియేటర్లలో కాకుండా సెల్ ఫోన్లలో సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. దీంతో డిజిటల్ ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ మార్పుని గమనించి స్వాగతిస్తున్న వారంతా డిజిటల్ ప్రపంచం వైపు అడుగులు వేస్తున్నారు.
ఇప్పటికే బాలీవుడ్లో అక్షయ్కుమార్ అమెజాన్ ప్రైమ్తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకోగా మనోజ్ బాజ్ పాయ్, సైఫ్ అలీఖాన్, మనోజ్ బాజ్పాయ్ వంటి వాళ్లు ఏకంగా వెబ్ సిరీస్లలో నటిస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. దక్షిణాదిలో జగపతిబాబు, రమ్యకృష్ణ, నవదీప్, మంచు లక్ష్మి, నిహారిక వంటి తారలు మాత్రమే వెబ్ ప్రపంచం వూపు అడుగులు వేశారు. తమిళ చిత్ర పరిశ్రమ నుంచి మొట్టమొదటి సారిగా కమల్ హాసన్ ఈ రంగంలో అడుగుపెట్టబోతున్నారు.
ఫ్యాషనేటింగ్ వరల్డ్లోకి ప్రవేశిస్తున్నందుకు ఆనందంగా వుంది. కథలు చెప్పడాన్ని నేను బలంగా నమ్ముతాను. ఇదొక మరో కొత్త అడుగు. భారీ స్థాయిలో వున్న ప్రేక్షకుల కోసం ఉత్తమ కథల్ని చెప్పే అవకాశం ఇది` అని కమల్ వెల్లడించారు. టర్మరిక్ మీడియాపై ఆర్. మహేంద్రన్ ఈ వెబ్ సిరీస్ని నిర్మించబోతున్నారు. కమల్హాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో `ఇండియన్ 2 ` చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.