కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేల దేశాలన్నీ లాక్ డౌన్ని ప్రకటించాయి. ప్రజలు ఈ వ్యాధి భారిన పడకూడదనుకుంటే ఇళ్లకే పరిమితం కావాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ దేశం మొత్తం లాక్ డౌన్లోకి వెళుతోందని అంతా 21 రోజుల పాటు ఇళ్లకే ఇళ్లకే పరిమితం కావాలని సూచించిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు అంతా ఇళ్లకే పరిమితమైపోయారు.
అయితే ఈ సందర్భంగా ఓ హీరోయిన్ భావోద్వేగానికి గురికావడం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయిన హీరోయిన్ ప్రియదర్శి కల్యాణి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. లాక్డౌన్ ప్రకటించిన దగ్గరి నుంచి స్వీయ నిర్భంధంలో వున్న కల్యాణి 21 రోజుల పాటు 21 సినిమాలు చూడాలని నిర్ణయించుకున్నారట.
అందులో భాగంగానే `మిరాకిల్ ఇన్ సెల్ నెం. 7` అనే ఓ టర్కీష్ చిత్రాన్ని చూస్తూ ఏడ్చేసిందట. ఈ చిత్రాన్ని అందరూ చూడాలని, సాధారణంగా తనాఉ వేరే చిత్రాల గురించి సోషల్ మీడియాలో వెల్లడించనని కానీ ఈ సినిమా చూశాక దీని గురించి పది మందికి చెప్పాలనిపించిందని, ప్రతీ ఒక్కరూ చూడాల్ఇన చిత్రమిదని` కళ్యాణి ప్రయదర్శన్ వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.