ఛలో చిత్రంతో ఈ ఏడాది చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్న యువ హీరో నాగశౌర్య తాజాగా నర్తనశాల చిత్రంలో నటిస్తున్నాడు . ఇది కూడా ఛలో లాగ సొంత సినిమా కావడంతో ఛలో లాగే విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నారు . అందుకే హీరోయిన్ ల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు . మొదట ఈ చిత్రంలో హీరోయిన్ గా మెహరీన్ కౌర్ ని తీసుకుంటున్నట్లు తెలిసింది కట్ చేస్తే ఆమె స్థానంలో కిరాక్ పార్టీ ఫేమ్ సిమ్రాన్ పరీంజా ని ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి .
ఇక ఇప్పుడేమో అఖిల్ తో రొమాన్స్ చేసిన హలో బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది . హలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ భామ ఇప్పుడు నాగశౌర్య తో రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యిందట ! అయితే ఆ చిత్ర బృందం అధికారికంగా తెలియజేస్తేనే నాగశౌర్య రొమాన్స్ చేసేది ఏ హీరోయిన్ తో అనేది తెలిసేది .