హైదరాబాద్లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్లు ప్రారంభించాలంటే స్టార్స్ భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది తమ సినిమాల షూటింగ్లని ఆగస్టు లేదా సెప్టెంబర్కు వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా తన `ఆచార్య` చిత్ర షూటింగ్ని వాయిదా వేసుకున్నారట. ఇదిలా వుంటే ఆయన అల్లుడు కల్యాణ్ దేవ్ తన తాజా చిత్రం `సూపర్ మచ్చీ`ని సోమవారం రామానాయుడు స్టూడియోస్లో ప్రారంభించారు.
ఇదే చివరి షెడ్యూల్. పులి వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రిజ్వాన్, ఖుషీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కన్నడ హీరోయిన్ రచితా రామ్ హీరోయిన్గా నటిస్తోంది. హీరో కల్యాణ్ దేవ్, రచితా రామ్, అజయ్ పాల్గొనగా కొన్ని ప్రధాన సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్తో చిత్రీకరణ మొత్తం పూర్తి కానుంది.
మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. తమన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ఎస్సెట్గా నిలవనుంది. మాస్, క్లాస్ ఆడియన్స్ని మెప్పించే చిత్రమిదని, కల్యాణ్దేవ్ క్యారెక్టర్ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని, టైటిల్ సాంగ్ అద్భుతంగా వచ్చిందని చిత్ర బృందం స్పష్టం చేసింది.