దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఎక్కడ చూసిన కరోనా మరణాలే. కరోనా కేసులే. దేశం మొత్తం ఎమర్జెన్సీలోకి వెళ్లిందా అంటే దేశ సర్వేన్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు కూడా ఇదే విషయాన్ని ప్రకటించడం కలవరానికి గురిచేస్తోంది. ఇదిలా వుంటే సినీ సెలబ్రిటీలు వరుపసగా కోవిడ్ బారిన పడుతుండటం అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తోంది.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కు కరోనా సోకినట్టు తెలిసింది. తాజాగా బుధవారం చేయించుకున్న పరీక్షల్లో తనకు పాజిటివ్ అని తేలినట్టు గురువారం కల్యాణ్ దేవ్ వెల్లడించారు. తనకు మైల్డ్ సిమ్టమ్స్ వున్నట్టుగా తెలిసిందని, హాస్పిటల్లో క్వారెంటైన్లో వున్నానని, త్వరలోనే తిరిగి వస్తానని స్పష్టం చేశారు.
మెగా ఫ్యామిలీలో ఇంత వరకు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, నాగా బాబుల తరువాత కరోనా వైరస్ సంక్రమించిన వారిలో కల్యాణ్దేవ్ కూడా చేరడం అభిమానలని కలవరానికి గురిచేస్తోంది. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజాను వివాహం చేసుకున్న కళ్యాణ్ దేవ్ ‘విజేత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కల్యాణ్దేవ్ ‘సూపర్ మచ్చి“, `కిన్నెర సాని` చిత్రాల్లో నటిస్తున్నారు.
View this post on Instagram