క్రేజీ హీరోయిన్గా తెలుగు, తమిళ భాషల్లో పేరు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ ఇటీవల తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైలోని హోటల్ తాజ్ లో జరిగిన వీరి పెళ్లిలో ఇరు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. పెళ్లి తరువాత జోరు పెంచిన కాజల్ ఇన్ స్టా వేదికగా ఆసక్తికర ఫొటోలని అభిమానుల కోసం షేర్ చేస్తోంది.
నాలుగు రోజుల క్రితం కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి మాల్దీవులకు హనీమూన్కి వెళ్లింది. వివాహం తరువాత తొలిసారి భర్తతో కలిసి మాల్దీవుల్లో విహరిస్తున్న కాజల్ అక్కడి అందాలని ఆస్వాదిస్తూ మురిసిపోతోంది. భర్త కిచ్లూతో కలిసి ఫొటోలకి పోజులిస్తున్న కాజల్ వాటిని ఇన్స్టా వేదికగా అభిమానలతో పంచుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇన్స్టాలో సందడి చేస్తున్నాయి.
భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి హోటల్ గదిలో వున్న ఫొటోలతో పాటు పలు సందర్భాల్లో పోజులిచ్చిన ఫొటోల్ని కూడా కాజల్ షేర్ చేయడంతో అవి వైరల్గా మారాయి. కాజల్ ప్రస్తుతం `ఆచార్య`, `భారతీయుడు 2, మోసగాళ్లు వంటి చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.