అందాల చందమామ కాజల్ అగర్వాల్ తన చిరకాల మిత్రుడు, ప్రియుడు గౌతమ్ కిచ్లూని కుటుంబ సభ్యుల అంగీకరాంలో ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైలోనరి హోటల్ తాజ్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం తరువాత ఈ కొత్త జంట హనీమూన్ కోసం మాల్దీవులకి వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి దీవుల్లో విహరిస్తూ హంగామా చేశారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. కాజల్ హనీమూన్ ఫొటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే వున్నాయి. పెళ్లికి ముందు నుంచి షూటింగ్లకు దూరంగా వుంటూ వస్తున్న కాజల్ తాజాగా మంగళవారం మెగాస్టార్ హీరోగా నటిస్తున్న `ఆచార్య` మూవీ సెట్లోకి అడుగుపెట్టింది. గౌతమ్ కిచ్లూతో కలిసి సెట్లోకి రావడంతో `ఆచార్య` ఈమ్ సర్ప్రైజ్ అయ్యారు. కోకాపేట్లో జరుగుతున్న సెట్లో మెగాస్టార్ చిరంజీవి కూడా వుండటంతో టీమ్ అంతా సర్ప్రైజ్ అయ్యారట.
ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు దర్శకుడు కొరటాల శివ, సినిమాటోగ్రాఫర్ తిరు, ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్, సహ నిర్మాత అన్వేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోకా పేటలో వేసిన భారీ సెట్లో మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్లపై ఓ పాటని చిత్రీకరించబోతున్నారు. ఈ భారీ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పై నిరంజన్రెడ్డి నిర్మిస్తున్నారు.