300 కోట్లు దాటేసిన కబీర్ సింగ్ వసూళ్లు
కబీర్ సింగ్ వసూళ్లు 300 కోట్లు దాటేశాయి . తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా . షాహిద్ కపూర్ – కియారా అద్వానీ జంటగా నటించిన కబీర్ సింగ్ జూన్ 21న విడుదల కాగా మొదటి రోజు నుండే భారీ వసూళ్లు సాధిస్తూ ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది .
నాలుగో వారంలో ప్రపంచ వ్యాప్తంగా 309 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేసాడు . దేశ వ్యాప్తంగా 259 కోట్లకు పైగా వసూళ్లు రాగా మిగతా దేశాలలో 51 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయట దాంతో 25 రోజుల్లో 309 కోట్ల వసూళ్లు వచ్చాయని ట్వీట్ చేసాడు . కేవలం 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్ ని షేక్ చేస్తోంది .