`కేజీఎఫ్` చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ టాక్ ఆప్ ది ఇండియాగా మారిపోయాడు. ఇది కేవలం అతని రెండవ సినిమా కావడం.. పాన్ ఇండియా స్థాయి విజయాన్ని సాధించడంతో ప్రశాంత్ నీల్కు దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాకు సీక్వెల్ని చేస్తున్న ఆయన తదుపరి చిత్రం ఎవరితో వుంటుందని సర్వత్ర చర్చ మొదలైంది. అయితే టాలీవుడ్ స్టార్ యంగ్టైగర్ ఎన్టీఆర్తో ఆయన తదుపరి చిత్రం వుంటుందని తేలిపోయింది.
ఇటీవల ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర మైత్రీ మూవీమేకర్స్ ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చేశాయి. దీంతో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ల కలయికలో రానున్న మూవీ ఎంలా వుండబోతోంది? .. ఎలాంటి కథతో వుంటుందనే ఆసక్తి మొదలైంది. అయితే ఇటీవల ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
`ఒక అణు కర్మాగారం పక్కన కూర్చోవడం ఎలా అనిపిస్తుందో నాకు తెలుసు. ఎన్టీఆర్ క్రేజీ ఎనర్జీని తట్టుకోవడం కోసం నెక్ట్స్టైమ్ వచ్చే ముందు రేడియేషన్ సూట్ని వెంట తెచ్చుకుంటాను` అని ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు. ఇందులోనే వీరిద్దిరి కలయికలో చేయబోతున్న సినిమా టైటిల్తో పాటు, సినిమా కాన్సెప్ట్ కూడా దాగి వుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి `రేడియేషన్`, లేదా `నూక్లియర్` అనే టైటిల్స్ని ఖరారు చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న `కేజీఎఫ్ 2` 20 శాతం చిత్రీకరణ మినహా పూర్తయింది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 23న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.