Homeటాప్ స్టోరీస్షాకింగ్: ఎన్టీఆర్ పిఆర్, నిర్మాత మహేష్ కోనేరు కన్నుమూత

షాకింగ్: ఎన్టీఆర్ పిఆర్, నిర్మాత మహేష్ కోనేరు కన్నుమూత

షాకింగ్: ఎన్టీఆర్ పిఆర్, నిర్మాత మహేష్ కోనేరు కన్నుమూత
షాకింగ్: ఎన్టీఆర్ పిఆర్, నిర్మాత మహేష్ కోనేరు కన్నుమూత

జీవితం ఏ నిమిషాన ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. ఈరోజు దాకా ఆరోగ్యంగా ఉన్నవారు రేపు ఎలా ఉంటారో చెప్పలేని పరిస్థితి నేటి కాలానిది. ఈరోజు ఉదయం టాలీవుడ్ నిర్మాత మహేష్ ఎస్ కోనేరు గుండెపోటుతో మృతి చెందడం ఇండస్ట్రీని కలిచివేసింది. మీడియా వ్యక్తిగా మహేష్ ఎస్ కోనేరు తన జర్నీను మొదలుపెట్టాడు. ఒక మీడియా సంస్థకు సినిమా రివ్యూలు రాసే మహేష్, ఎన్టీఆర్ కుటుంబంతో సాన్నిహిత్యం మొదలవ్వడంతో నందమూరి ఫ్యామిలీకి పిఆర్ గా మారాడు.

ఆ తర్వాత ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పేరిట ప్రొడక్షన్ సంస్థను మొదలుపెట్టి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. 118, మిస్ ఇండియా, తిమ్మరుసు చిత్రాలతో విజయవంతమైన నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే విజయ్ నటించిన విజిల్, మాస్టర్ చిత్రాలను తెలుగు రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూట్ చేసాడు మహేష్.

- Advertisement -

“బరువెక్కిన గుండెతో, నమ్మశక్యంగా లేకున్నా చెబుతున్నా, నా ప్రియ మిత్రుడు మహేష్ కోనేరు ఇక లేరు. ఆయన గుండెపోటుతో మరణించారు. నేను ప్రస్తుతం షాక్ లో ఉన్నా, ఏం మాట్లాడలేకపోతున్నా. ఆయన కుటుంబానికి, బంధుమిత్రులకు నా ప్రఘాడ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని ఎన్టీఆర్ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ తో కూడా ఒక చిత్రాన్ని నిర్మించే ప్లాన్ లో ఉన్నాడు మహేష్ కోనేరు. కానీ ఈలోగా ఇలా దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All