యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నుండి వస్తోన్న నెక్స్ట్ సినిమా రిపబ్లిక్. ఈ సినిమా అక్టోబర్ 1న గాంధీ జయంతి వీకెండ్ సందర్భంగా విడుదల కానుంది. రిపబ్లిక్ లో తేజ్ పంజా అభిరామ్ పాత్రను పోషిస్తున్నాడు. ప్రయోగాత్మక చిత్రాలు తీసే దేవా కట్టా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమాలో తేజ్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తుండగా దానికి సంబంధించి గొప్ప గొప్ప కలెక్టర్ల గాథలను కూడా మన ముందుకు తీసుకురానున్నారు. థాంక్యూ కలెక్టర్ ఇనిషియేటివ్ కింద ఈ ప్రమోషన్ ను చేపడతారు. అయితే దానికంటే ముందే ఈ చిత్రం నుండి మాస్ నెంబర్ జొర్సే బార్సే సాంగ్ విడుదలైంది.
మణిశర్మ స్వరకల్పనలో సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించగా లేటెస్ట్ సెన్సేషన్ అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. ఈ మాస్ నెంబర్ వినగానే ఇన్స్టంట్ గా కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మణిశర్మ మాస్ సాంగ్ ను కొట్టడంలో తన నేర్పును చూపించాడు. ఈ సాంగ్ లో తేజ్ తన డ్యాన్స్ ల పరంగా కూడా ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేయనున్నట్లు తెలుస్తోంది.
#JorSe – An opportunity for me to dance my heart out in a song after a long time. Had a blast working on this song. Hope you all will like it as much as we did.
▶️: https://t.co/OTHCvR7lBo@aishu_dil @IamJagguBhai @meramyakrishnan @devakatta #Manisharma@bkrsatish @ZeeStudios_ pic.twitter.com/nD4h3NiTsJ
— Sai Dharam Tej (@IamSaiDharamTej) September 6, 2021