`బాహుబలి`తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ల జాబితాలో చేరిపోయారు. తన క్రేజ్కి తగ్గట్టే పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ నటించనున్న రెండు పాన్ ఇండియా చిత్రాలు ఆదిపురుష్, సలార్ ఈ నెలలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో `సలార్` చిత్రాన్ని `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన జూనియర్ ఆర్టిస్ట్లకి సంబంధించిన ఆడిషన్స్ ఇటీవల హైదరాబాద్, చెన్నై, కర్ణాటకలలో జరిగాయి.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రభాస్ తరువాత మరో నటి, నటుడికి సంబంధించిన ఎంపిక జరగలేదు. కానీ ఇటీవల మాత్రం ఈ చిత్రంలో బాలీవుడ్ హాటీ దిశా పటాని నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం కోసం మరో బాలీవుడ్ నటుడి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జాన్ అబ్రహం ఈ చిత్రంలో విలన్గా నటించనున్నట్టు తెలుస్తోంది.
`సలార్` మూవీని పవర్ప్యాక్డ్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా నిర్మించబోతున్నారు. కాబట్టి ప్రభాస్కు విలన్ పవర్ఫుల్గా వుండాలని భావించి జాన్ అబ్రహంని చిత్ర బృందం సంప్రదించిందని వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో అత్యంత భారీ స్థాయిలో రూపొందనున్న ఈ మూవీని హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మించనున్న విషయం తెలిసిందే.